4.9.2024_ఏలూరు_వరద బాధితులకు ఎమ్మెల్యే బడేటి చంటి ఆపన్నహస్తం
బడేటి సేవలు స్పూర్తిదాయకమన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి...
బాధితులకు దుప్పట్లు, టవల్స్ పంపిణీ...
ఏలూరు, సెప్టెంబరు, 4...విజయవాడ వరద బాధితులకు ఆహారంతోపాటు వస్త్రాలు అందించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడలో వరద బాధితులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏర్పాటు చేసిన దుప్పట్లు, టవల్స్ ను బాధితులకు అందించే కార్యక్రమంలో రాష్ట్రమంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి పాల్గొన్నారు. వరద బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్న బడేటి సేవలు నిరుపమానమన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న వారికి ఆపన్నహస్తం అందించాలని గౌ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా రాష్ట్రమంత్రి కొలుసు పార్ధసారధి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని 10 డివిజనల్లో బాధితులను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఏలూరు నుంచి 30 వేల కుటుంబాలకు అవసరమైన ఆహార పొట్లాలను అందించామన్నారు. అయితే కొంతమంది బాధితులు తాము కట్టుబట్టలతో బయటకు వచ్చామని చెప్పారని దీనిని దృష్టిలో ఉంచుకొని వెయ్యి కుటుంబాలకు దుప్పట్లు, టవల్స్ ను మంత్రిగారి సమక్షంలో బాధితులకు అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా బ్రెడ్, తదితర నిల్వవుంటే ఆహార పదార్ధాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బాధితులను ఆదుకోవడంలో ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గౌ. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
Негізгі бет 4.9.2024_ఏలూరు_వరద బాధితులకు ఎమ్మెల్యే బడేటి చంటి ఆపన్నహస్తం
Пікірлер