77 వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక గీతం.
రచన : శ్రీ. రాయప్రోలు సుబ్బారావు.
సంగీతం : శ్రీ. వందేమాతరం శ్రీనివాస్.
గానం: "తెలుగుకోకిల' శ్రీమతి భూదేవి.
వ్యాఖ్యానం: శ్రీ తనికెళ్ళ భరణి గారు.
#ఏదేశమేగినాఎందుకాలెడినా
#తెలుగుపాట
#దేశప్రేమగీతం
#ఆత్మీయసంగీతం
#భావుకసాంగీతం
#జననీకానిగానం
#పాతగానం
#దేశాభిమానిగీతం
#మనదేశం
#ఆత్మీయపాట
#Bhudevi #august2023 #india #independence #song #PatrioticMelody
ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలపరా నీ జాతి నిండు గౌరవము.
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.
లేదురా ఇటువంటి భూదేవి యెందూ
లేరురా మనవంటి పౌరులింకెందు.
సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,
ఓడలా ఝండాలు ఆడునందాక,
అందాక గల ఈ అనంత భూతలిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీతెలుగు బాలగీతములు
పాడరా నీ వీర భావ భారతము.
Негізгі бет Музыка 77వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక గీతం. ఏ దేశమేగినా ఎందు కాలెడినా || గాయని భూదేవి
Пікірлер: 14