పేరుకు పదో తరగతి విద్యార్థులే...కనీసం ఎక్కాలు రాని దుస్థితి. ఏడెనిమిది తరగతుల్లోకి వచ్చినా చిన్నచిన్న తెలుగు పదాలు కూడా చదవలేరు. ఆంగ్లం, గణితం, సైన్స్...ఇలా ఏ సబ్జెక్టు తీసుకున్నా సరే...పదోతరగతి లోపు విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలు లేవని ప్రభుత్వ విద్యా నివేదికలే ఏటా వెల్లడిస్తున్నాయి. అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణులై ఉన్నత తరగతులకు వెళ్లినా... నాలుగైదు తరగతుల్లోని పాఠ్యాంశాలపై విద్యార్థులకు కనీస అవగాహన ఉండదు. అంతెందుకు డిగ్రీలు, పీజీలు చేసినా సరైన భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు లేని కారణంగా నేటి యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి. వీటన్నింటికీ కారణం ఏమిటి? సమాజ అవసరాలకు అనుగుణంగా మార్పు చెందలేని నేటి విద్యావిధానమే అంటోంది... వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలోని అక్షరవనం. చదువంటే భయం, ఒత్తిడి లేకుండా ఆట పాటలతో అత్యంత సులువుగా నేర్చుకునే విద్యావిధానం తక్షణ అవసరమని గుర్తు చేస్తోంది. సులువైన... ఆమోదయోగ్యమైన బోధన విధానాలపై ప్రయోగాత్మక పరిశోధన కొనసాగిస్తూ... సత్ఫలితాలు అందుకుంటోంది.
#Idisangathi
Негізгі бет Akshara Vanam by Vande Mataram Foundation | Leading the Way in Modern Teaching
Пікірлер: 59