గత 20ఏళ్లగా నగర వాసులకు నాణ్యమైన,రుచికరమైన అల్పాహారాలు అందిస్తూ ఘన కీర్తి గడించిన
శేఖర్ టిఫిన్స్ సెంటర్ ను.ప్రత్యేకంగా ఇక్కడ లభించే ఎంతో రుచికరమైన గుడ్డు దోశ ను నేను ఈ వేళ మీకు పరిచయం చేస్తూ అల్పాహార శాల నిర్వాహకులు రాజశేఖర్ గారు జీవన పయనంలో ఎన్నో ఆటుపోట్లను ఎదురీది ఆశయ తీరానికి చేరిన స్ఫూర్తివంతమైన వైనాన్ని మీకు తెలుపు ప్రయత్నమే ఈ కార్యక్రమ ముఖ్య సారాంశం.
అనంతపురం తోపాటు సమీప గ్రామాల్లో ఎగ్ దోశ శేఖర్ గా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు వారు.అంతటి ప్రాముఖ్యత రావడం వెనుక శేఖర్ గారు చేసిన కృషి ఎంతో ఉంది.కావున వారి శ్రమ, కష్టాన్ని తొలుత వివరించి తదనంతరం వారి దోశ గూర్చి తెలుపుతాను.
అందరికీ శేఖర్ గా సుపరిచితులైన రాజశేఖర్ గారు తొలుత ఆటో నడిపే వారు.ఆ వాహనం పాతది కావడంతో వచ్చే సంపాదన మొత్తం దాని మరమ్మతులకే సరిపోయేవి.కారణంగా కుటుంబ పోషణ క్లిష్టమై పూట గడవడం కష్టమైంది.అర్ధాకలి తో వారి బ్రతుకుబండి సాగుతున్న పరిస్థితితుల్లో అత్యవసర సమయాల్లో బయట రూపాయి పుట్టేది కాదు.ఆపదలో ఉన్నాడు సహాయం చేద్దామన్న తలంపుకన్న తిరిగి ఎలా ఇస్తాడన్న సందేహం ఉండేది ఆనాటి వారి పరిచయస్థుల్లోని అత్యధికుల్లో
ఏ ఆసరా లేకపోవడంతోదేవుడి పై భారం వేసే వ్యధతో ఆవేదనతో కాలం సాగిస్తూ
ఓరోజు దీర్ఘాలోచన చేసిన రాజశేఖర్ గారు ఏదైనా స్వయం ఉపాధి కల్పించుకుని ఎంత శ్రమైనా చేసి తమ స్థితిని మార్చుకోవాలని తద్వారా ఉన్నతమయజీవితం ఏర్పరుచుకోవాలని సంకల్పిచారు.గతనుభవం లేకున్నా అల్పాహారాల అంగడి ప్రారంభించాలని నిర్ణయం తీసుకోగా వారి ప్రాణ మిత్రుడు ఖాసీం గారు కొన్ని పాత్రలు కొనివ్వగా కల్యాణ దుర్గం బైపాస్ వద్ద 2000లో అల్పాహారాల అంగడి ప్రారంభించి ఉగ్గానిబజ్జి ఇతర అల్పాహారాలు అందిచసాగారు
తొలినాళ్ళ వ్యాపారం అంతగసాగలేదు..అయినను నైరాశ్యం చెందకుండా నిర్వహణ చేస్తున్న తరుణంలో ఓసారి వారి మరో మిత్రుడు bsp నాగరాజు గారు రాజశేఖర్ గారితో తొలిసారిగా గుడ్డు దోశ వేసేలా పురమాయించారు.
తొలిదోశ వారు అనుకున్న రీతిలో కాక చాలా మందంగా రావడం తో వైఫ్యలం గా భావించి రుచి చూడగా మంచి రుచిని కలిగి ,అత్యంత మృదువుగా ఉంది.దోశ రుచి పలువురికి చూపగా తిన్నవారు అందరూ రుచి చాలా బావుంది అని అభిప్రాయం వ్యక్తం చేయడంతో మరుసటి రోజు నుండి తమ అల్పాహారాలుశాల లో గుడ్డు దోశను అందించడం ఆరంభించారు.ప్రజలు సైతం
తిన్న తదుపరి రుచి,నాణ్యత పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో స్వల్పకాలం లోనే శేఖర్ గారి దోశకు విశేష గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో శేఖర్ టిఫిన్స్ సెంటర్ కువచ్చే వారి సంఖ్య పెరిగింది.శేఖర్ గారికి అనంతపురం వాసుల నుండి విశేష ఆదరణ, మంచి గుర్తింపు లభించింది.అందుకు ప్రత్యేక్ష ఉదాహరణే వారి అల్పాహారాల శాల ప్రాగణం జనంతో కోలాహలంగా ఉన్న ఈ దృశ్యాలు.
దోశ కోసం ఎంతమంది వచ్చిన సకాలంలో దోశలు అందిస్తారు.వారు దోశలు వేయు ప్రక్రియ ఎంతో ఆసక్తికారంగా ఉంటుంది. ఏక కాలంలో16దోశలను తయారు చేయు ఘట్టం చూడ ముచ్చటగా ఉంటుంది.
దోశ చాలా మందంగా ఉన్న రొట్టె మాదిరిగా మృదువుగా ఉంటుంది.దోశ పై కాస్త కారం, మసాలా పొడి చల్లి. వేరుశెనగ సేనగ పప్పుతో
తయారు చేసిన పచ్చడి తో అందిస్తారు. దోశకు, పచ్చడిని మిళితం చేసి తింటే వచ్చు రుచి మిరెప్పుడు ఆస్వాదించన అనుభూతిని కలిగి ఉంటుంది.ఆ రుచి అనంతపురం వాసులకు మాత్రం సుపరిచితమే. ఇచ్చట దోశను తిన్న నేను నాణ్యతరుచి పరంగా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.ఈలాంటి దోశను ఇంతటి రుచిని నేనేప్పుడు చూడలేదు.
చిత్రీకరణ సందర్భంలో రాజశేఖర్ గారు మనతో తన ఆనందాన్ని పంచుకున్నారు.నాడు ఎన్నో కష్టాలు అనుభవించిన తాను
నేడు సొంత గూడు ఏర్పరుచుకుని పిల్లల్ని ఉన్నత విద్యావంతలుగా తీర్చిదిద్దున్నట్లు తెలిపారు ఈ దోశ తన ఆశను నెరవేర్చిందన్న రాజశేఖర్ గారు.ఈ విజయం తనొక్కడిదేకదాని అమ్మ సావిత్రమ్మ గారు ,తన సహా ధర్మచారిని లక్ష్మీ దేవి గారు, కుమారుడు మనోజ్ బాబు గారు, వారి కుమార్తె కష్టం ఎంతో వుందన్నారు. అంతిమంగా తమ ఉన్నతికి కారకులైన అనంతపురం వాసులకు రాజశేఖర్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
ఆకలి విలువ తెలిసిన వారు కనుక రాజశేఖర్ గారు అల్పాహారాల శాలలో తక్కువ ధరకే ఆహార పదార్థాలు అందిస్తున్నారు. ప్రతి శనివారం అలానే మిత్రులతో కలసి ఏ ఆదరణ లేని వారి కి భోజనం పంపిణీ చేస్తూ తమ సహృదయతను
చాటుతున్నారు.అలానే కరోనా విపత్కర కాలంలో పోలీసులకు, ఇతర రాష్ట్రాల వారికి ,సరుకు రవాణా వాహన చోదకులకు నిర్విరామంగా ఆహారం అందజేసి ఎందరో ఆకలి తీర్చారు.
వైఫల్యాన్నే అనువుగా మార్చుకుని కఠోర ధిక్షే విజయ సోపానంగా భావించి శ్రమించి తానుఅనుకున్న విధంగా ఉన్నతంగా జీవితాన్ని తీర్చి దిద్దుకున్న రాజశేఖర్ గారు పలువురికి ఆదర్శం.
#Anantapuram
#Famouseggdosa
#foodbook
Негізгі бет Anantapuram Famous Egg Dosa | Shekar Tiffin Center | Rayalaseema Special Egg Dosa | Food Book
Пікірлер: 343