ఆషాడ మాసం సందర్భంగా మంగళవారం నాడు,పశ్చిమగోదావరి జిల్లా,భీమవరం పట్టణంలోని,మెంటే వారి తోటలో, గ్రంధి శ్రీనివాస్ నగర్ నందు భీమవరం గ్రామ దేవత, ఆరాధ్య దైవం, ఇలవేల్పు అయిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆషాడ మాస జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమారాధన కార్యక్రమాన్ని శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ M.V.V.S.T.ప్రభాకర్ రావు( బ్యాటరీ మూర్తి )ప్రారంభించి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో మావుళ్ళమ్మ వారి జాతర ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారని ,దశాబ్ద కాలం పైగా పెద్ద ఎత్తున అన్న సమారాధన కూడా నిర్వహిస్తున్నామని, ఈరోజు ఉదయం అమ్మవారికి మహిళలు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, అన్న సమారాధన ప్రారంభించామని, 6000 మందికి పైగా అన్న సమారా ధన లో అన్న ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ నాయకులు ,స్థానికులు, మహిళలు సేవలు అందించారు.
#bhimavaram #godavaridosth #westgodavari #westgodavaridistrict #westgodavarinews #god #temple #mavullamma
Негізгі бет భీమవరం మెంటేవారితోటలో బ్యాటరీమూర్తి గారి ఇంటిఆవరణలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం
Пікірлер: 1