శ్రీశివానంద గురుభ్యో నమః శ్రీనిసర్గదత్త మహరాజ్ వారి "ధ్యానములు" అనే గ్రంధంపై శివశ్రీ రమణ గురుదేవుల సత్సంగ ప్రసంగాల సారాంశమైన "నేనెవరు"(17) వ్యాససంపుటి నుండి సేకరణ ది.09/08/23
నిద్రలో ఇవన్నీ లేకపోయినా నేను ఉన్నాను!
అన్నింటిని తెలుసుకునే ఎరుకే నీ స్వరూపం. ఇది అర్థమయ్యే వరకూ పెద్దల మాటలను, బోధలను మననం చేస్తూ విచారణ సాధనగా సాగాలి. అందుకు వైరాగ్యం ఎంతో ఉపకరిస్తుంది.. వైరాగ్యం అంటే అన్నింటినీ విస్మరించడం, తిరస్కరించడం కాదు. వస్తువుకు ఉండే నిత్యత్వం, శాశ్వతత్వం తెలిసి తగుమాత్రం విలువను ఇవ్వడమే వైరాగ్యం. మనకు గాఢ నిద్రలో దేవుడు, జీవుడు, ప్రపంచం అనే ఏ భావన లేకుండా ఉంటున్నాము. ఇప్పుడు అన్ని అనుభవించే మనసు కూడా లేకుండా మనం ఉంటాము. మెలకువ రాగానే నేను అనే భావం ముందుగా ఏర్పడి ఆ తర్వాతే జీవుడు, దేవుడు, ప్రపంచం అనే భావాలు ఏర్పడుతున్నాయి. నిద్రలో ఇవన్నీ లేకపోయినా నేను ఉన్నాను. ఏదిగా ఉన్నాను, ఎవరిగా ఉన్నాను అన్న అన్వేషణ "మన స్వస్వరూపం ఇది కాదు" అనే సత్యాన్ని బోధ పడేలా చేస్తుంది. గాఢ నిద్రలో కలిగే సంతోషం, శాంతి భౌతిక ఫలాలవల్ల వచ్చేవి కాదు అని అర్ధం అవుతుంది.
శ్రీశివానందగురు ఎడ్యుకేషనల్ & కల్చరల్ ట్రస్ట్, శ్రీగురుధాం ధర్మ క్షేత్రం, బలుసుపాడు, జగ్గయ్యపేట మం. ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. srigurudham.org
Негізгі бет చేస్తున్నది నువ్వు కాదని తెలిస్తే ప్రతి మంత్రం తారకమే! ది.31.05.24
Пікірлер: 16