#peddapalli
#sridharbabu
#congress
#manthani
#revanthreddy
#telangana
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే రెండు గ్యారెంటీ పథకాలను ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. *మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసి బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా నడుస్తున్నదని, ఇప్పటి వరకు 10 కోట్ల పైగా జీరో టికెట్లను జారీ చేశామని, మహిళా సాధికారత దిశగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉపయోగ పడుతుందని అన్నారు.
మహాలక్ష్మి పథకం అమలులో వచ్చే సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించడానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు బస్సులో ప్రయాణించా రని, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో చిత్తశుద్ధి కనబర్చిన పెద్దపల్లి జిల్లా అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని మంత్రి పేర్కొన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం వల్ల మన జిల్లాలో 1400 పైగా రోగులు ఇప్పటి వరకు లబ్ది పోందారని అన్నారు. విద్య, వైద్య రంగాలపై కలెక్టర్ ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వ్యవసాయ శాఖలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా అవగాహన కల్పించాలని, రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
జిల్లాలో రైతుల పొలాలకు సాగునీరు అందించే దిశగా సాంకేతికంగా అనుకూలంగా ఉన్నచోట్ల ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారుచేసి సమర్పించాలని మంత్రి నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మార్చి చివరి నాటికి పంచాయతీరాజ్ శాఖ తరపున మంజూరు చేసిన ఉపాధి హామీ పనులు పూర్తిచేయాలని, డిఎంఎఫ్టీ ఫండ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
ప్రతి నియోజకవర్గ పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం నిర్మించేందుకు, ఆస్పత్రుల విస్తరణకు, రెసిడెన్షియల్ పాఠశాలల సొంత భవనాల నిర్మాణానికీ, రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించాలని మంత్రి తెలిపారు.ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేస్తూ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలని మంత్రి పేర్కొన్నారు.
Негізгі бет ఆదర్శవంతమైన జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలి ...రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
Пікірлер