రంపచోడవరంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ... ర్యాలీలో పాల్గొన్న మిరియాల శిరీష...
జరిగిన ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గం లో ఊహించని విజయం సాధించిన టిడిపి అభ్యర్థి మిర్యాల శిరీష దేవి ఈరోజు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ర్యాలీలో పాల్గొని ప్రధాన రహదారి మార్గంలో రంపచోడవరం చేరుకుని రంపచోడవరం స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం కార్యకర్తలు అభిమానులు ఏర్పాటుచేసిన కొమ్ము డాన్సులు గిరిజన నృత్యాలు తిలకించి అభిమానులు ఏర్పాటు చేసిన గజమాలను క్రేన్ సహాయంతో శిరీష దేవి భాస్కర్ దంపతులకు వేసి అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు...
అనంతరం మిరియాల శిరీష దేవి మాట్లాడుతూ రంపచోడవరం నియోజవర్గంలో మంత్రి లేని లోటును తీరుస్తానని ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని ఎవ్వరికీ భయపడవద్దని అన్నారు. పది సంవత్సరాల విరామం తర్వాత నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగర వేయడానికి ప్రజలు తనను గెలిపించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రజలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు వేలాదిగా వచ్చి ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం నియోజకవర్గంలోని గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాలో ర్యాలీ కొనసాగుతోంది
Негізгі бет ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి కి ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు
Пікірлер: 3