శ్రీవారికి 108 బంగారు తామర పుష్పాలు
రెండు కోట్లు విలువ గల బంగారు తామర పుష్పాలను విరాళంగా ఇచ్చిన వైద్యుడు
శ్రీవారికి భారీ విరాళం అందింది..రెండు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు తామర పుష్పాలను కడపకి చెందిన డాక్టర్ రాజీవ్ రెడ్డి టీటీడీకి విరాళంగా ఇచ్చారు.. శ్రీవారి ఆలయంలో ప్రతి మంగళవారం స్వామి వారీ మూలమూర్తికి నిర్వహించే వారపు సేవైన అష్టదళ పాద పద్మారాధన సేవకు ఉపయోగించే 108 బంగారు తామర పుష్పాలను లలితా జ్యువెలర్స్ లో ప్రత్యేకంగా తయారు చెయించిన దాత రాజీవ్ రెడ్డి లలితా అధినేత కిరణ్ కుమార్ తో కలిసి తిరుమలకి చేరుకొని, విఐపి బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకొని, బంగారు పుష్పాలను అర్చకులచే స్వామి వారీ పాదాల ఉంచి ఆశీస్సులు పొంది అనంతరం రంగనాయకుల మండపంలో 108 బంగారు తామర పుష్పాలను టీటీడీ అధికారులకు అందజేసారు.. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాత రాజారెడ్డిని స్వామి వారీ వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. ఇప్పటికే ఓ ముస్లిం భక్తుడు విరాళంగా ఇచ్చిన 108 బంగారు పుష్పాలను అష్టదళ పాద పద్మారాధన సేవ సమయంలో అర్చకులు వినియోగిస్తుండగా..ఇప్పుడు విరాళంగా వచ్చిన పుష్పాలను టీటీడీ ఎప్పటి నుంచి వినియోగిస్తుందో తెలియాల్సి
ఉంది.
@OveNetwork
#tirumala #ttd #donation #lalithajewellerydesigns #kirankumar #goldenlotus #ovenetwork #ove
Негізгі бет Golden Lotus | oVe Network
Пікірлер