2022 లో టీటీడీ మొత్తం ఆదాయం లెక్కల్లో ఎంత? అందులో లడ్డూల నుంచి ఎంత ఆదాయం వచ్చిందో కంపేర్ చేస్తే కన్ఫూజన్ లేకుండా ఉండేది.
@MadhavJK
58 минут бұрын
తిరుపతి లడ్డూ వివాదం కాస్త పక్కన పెట్టి అసలు తితీదేలో వాస్తవానికి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం. తితిదేలో పైనుంచి కింది వరకు, చివరికి గర్భగుడిలో ఉండే పూజారులతో సహా అందరూ అవినీతిపరులే. దేవుడు, మతం, భక్తి పేరిట జరిగే తంతు వెనక అంతా మోసం, దగా రాజ్యం ఏలుతుంది. ప్రపంచంలోని అవినీతిని అంతా ఏరి ఒకచోట కుప్పగా పోస్తే ఎంత ఉంటుందో, అంతటి అవినీతి ఏడు కొండల వాడి దగ్గర పోగై ఉంది అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. కొండమీద... బస, సేవల టికెట్లు, దర్శన టికెట్లు, ప్రసాదాలు, కాషన్ డిపాజిట్ల వాపసు… బైట వెలసిన మఠాలు, ప్రైవేటు హోటళ్ళు, దుకాణాలు… ఇలా ఒకటేమిటి… అన్నింటిలో ఎక్కడ లేని అవినీతి. చివరికి గర్భ గుడిలో నిత్యం ఆ పరమేశ్వరుడి పాదాల చెంత పూజ చేసుకునే ఓ ప్రధాన అర్చకుల ‘డాలర్’ భోగోతం, పరకామణిలో పైసలను మాయం చేసిన మాయగాళ్ళ మాయాజాలం గురించి అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈవో / చైర్మన్ స్థాయి నుంచి అటెండర్ స్థాయి వరకూ… పూజారి నుంచి గుండు గీసే వాడి దాకా… ఎక్కడ చూసినా లంచావతారుల హవాయే నడుస్తుంది. అక్కడ డబ్బు, అధికారం, రెకమండేషన్లు ఉన్న వాడికే సకల సౌకర్యాలు లభిస్తాయి. డబ్బు, అధికారం, హోదా ఉన్న వారికి, వారి అనుయాయులకు ‘బ్రేక్ దర్శనం’, ‘వీఐపీ దర్శనం’ పేరిట… ఈవో, జేఈవో స్థాయి అధికారులు… పోటీలు పడి వారిని వెంట బెట్టుకుని నింపాదిగా దర్శనం చేయించి, ప్రత్యేక దీవెనలు, పట్టు వస్త్రాలు, ప్రసాదాలు సమర్పించుకుని అతిధి మర్యాదలతో సాగనంపుతారు. అవేమీ లేని సామాన్యుడు మాత్రం రోడ్ల మీదనే బస చేసి, గంటలు, రోజుల తరబడి క్యూ లైన్లలో మగ్గిపోయి, చచ్చీ చెడీ గుడి లోపలికి వెళ్ళి, దూరం నుంచి కేవలం ఒక్క సెకను పాటు కూడా దర్శన భాగ్యం దొరక్క, బైటపడి, ఇచ్చిన కాస్త ప్రసాదం తీసుకుని… దానికే తన జన్మ సార్థకం అయ్యిందని వెనుదిరుగుతాడు. అందుకే వేంకటేశ్వరుడు కేవలం హోదా, డబ్బున్న వారి దేవుడు అని గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఈ తతంగం అందరికీ తెలిసినా, దశాబ్దాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపోయిన యాత్రికులు కూడా అలా చెయ్యటం తప్పు అని ఎవ్వరూ భావించటం లేదు. ‘దేవుడి ముందు అందరూ సమానం’ అన్న ప్రవచనం పని చెయ్యదు. ఇలా హిందూ మతం పరువు, ప్రతిష్ట, గౌరవం ఏనాడో మంటగలిసి పోయాయి. ఇక అక్కడ పవిత్రతకు చోటు ఎక్కడ ఉంది? దుర్భిణి వేసి వెతికినా కానరాదు! ప్రతి చిన్న దానికీ మా “హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ”ని పూనకాలతో ఊగి పోయే మతోన్మాదులకు… దశాబ్ధాలుగా కొండ మీద ఇంతటి అవినీతి జరుగుతున్నా మనోభావాలు దెబ్బతినకుండా చెక్కు చెదరకుండా ఎలా పదిలంగా ఉన్నాయో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వారు దేవుడి సొమ్ము… అదే… భక్తుల సొమ్ము… కడుపు నిండా భుజిస్తున్నారు. దేవుడిని, మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. జనాలు పిచ్చోళ్ళు కాబట్టి ఈ రాజకీయ నాయకులు వారిని దేవుడు, భక్తి, మతం పేరుతో వారితో ఆడుకుంటున్నారు. ఇవన్నీ ఆ వేంకటేశ్వరుడికి తెలుసో, లోదో తెలియదు. తెలిసినా ఎందుకు ఊరుకుంటున్నాడో ఆయనకే తెలియాలి. ప్రతి దానికీ టైం రావాలని సరిపెట్టు కుంటున్నాంగా! ఇది కూడా అలాగే మూసుకు కూర్చుందామా!?
Пікірлер: 5