హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. మాదాపూర్లోని N కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. తుమ్మకుంట చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. పక్కా ఆధారాలతో తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత చేపట్టారు. హైదరాబాద్లో గత కొన్నిరోజులుగా ప్రభుత్వ భూముల కజ్బాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన హైడ్రా.. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసి వేశారు. N కన్వెన్షన్ కు వెళ్లడానికి అనుమతి లేదంటూ భారీకేడ్లను ఏర్పాటు చేశారు. కూల్చివేతల ప్రాంతం దగ్గరకు ఎవరిని అనుమతించడం లేదు. మాదాపూర్ లో 10 ఎకరాల్లో N కన్వెక్షన్ నిర్మాణం చేశారు. మొత్తం 29 ఎకరాల్లో తమ్మిడి కుంట చెరువు వ్యాపించి ఉండగా.. చెరువును కబ్జా చేసి 3 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. FTL , బఫర్ జోన్ లో ఉండటంతో కన్వెన్షన్ కూల్చివేశారు. N కన్వెన్షన్ సినీ హీరో నాగార్జునకు చెందినదిగా పలువురు హైడ్రాకు చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
- Күн бұрын
మాదాపూర్లోని N కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు |🟥DD News Telangana
- Рет қаралды 23
Пікірлер