మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది. అమర్నాథ్ యాత్ర కోసం ఎందుకు ఇంత ఆరాటం. చావుబతుకుల మద్య ఎందుకు ఎంత పోరాటం. అమర్నాథ్ యాత్ర యెక్క పూర్తి details videoలో చూడండి.
అమర్నాథ్ గుహ వెనక కథ!: అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు. దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది! ఒకానొక సందర్భంలో శివుని సతి పార్వతి, తనకు అమరత్వం గురించిన రహస్యాన్ని చెప్పమని కోరిందట. ఆ రహస్యాన్ని ఏ జీవి విన్నా కూడా, ఆ ప్రాణికి అమరత్వం సిద్ధిస్తుంది. అందుకని ఎవ్వరూ లేని ప్రాంతంతో పార్వతికి అమరత్వ రహస్యాన్ని చెప్పాలనుకున్నాడట పరమేశ్వరుడు. అందుకని ఏ ప్రాణీ చేరుకోలేని అమర్నాథ్ గుహను ఎంచుకొన్నాడట. అమరనాథ్ గుహకు వెళ్ళే దారిలో పెహల్గావ్ అనే గ్రామం ఉంది. దీనిని ‘బైల్ గావ్’ అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందట. ఇక చందన్వారీలో తన సిగలోని చంద్రుడినీ, శేష్నాగ్ దగ్గర తన మెడలో పాములనీ, మహాగణేశ పర్వతం వద్ద కుమారుడు గణేశుడినీ, పంచతరణి దగ్గర తనలోని పంచభూతాలనీ విడిచారని చెబుతారు. ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచినవాటిని తలపించేలా ఉండటం విశేషం. అయితే శివుడు పార్వతికి అమరత్వం గురించి చెప్పే సమయంలో. ఒక పావురాల జంట ఆ రహస్యాన్ని విన్నదట. అప్పటినుంచీ ఆ పావురాల జంట మరణమే లేకుండా అక్కడక్కడే తిరుగుతున్నాయని అంటారు. అమర్నాథ్ యాత్రికులందరికి ఆ పావురాలు కనిపిస్తాయి।
చరిత్ర
గొర్రెల కాపరి కథ: ఏడాది పొడవునా ఈ గుహలోకి ప్రవేశించడానికి సాధ్యం కాదు. కేవలం ఎండాకాలం వచ్చేసరికే ఇక్కడి మంచు లింగం ఏర్పడుతుంది. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటిబొట్లు ఆ సమయంలో ఓ లింగాకారంలోకి మారతాయి. ఇలా పది కాదు వందకాదు వేల సంవత్సరాల నుంచీ జరుగుతోందని చెబుతారు. అందుకు సాక్ష్యంగా పురాణాలలో సైతం ఈ గుహ ప్రస్తావన కనిపిస్తుంది.
300 బిసికి చెందిన రాజు ఆర్యరాజా ఈ లింగాన్ని అర్చించినట్టు చెబుతారు. కాశ్మీర రాజుల కథలను వివరించే రాజతరింగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమరనాథ్ స్వామికి త్రిశూలం, బాణలింగాలు సమర్పించినట్టు ఈ పుస్తకంలో వివరించారు.[8] ప్రజయభట్టుడు రాసిన రాజవ్లిపతకాలో కూడా అమర్నాథ్ యాత్ర గురించి వివరించారు. ప్రాచీన గ్రంధాల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి.
అయితే ఈ మార్గం దుర్గమంగా మారిపోవడంతోనో, శత్రురాజులకు భయపడో, 12వ శతాబ్దం తర్వాత భక్తులు గుహ వైపుగా వెళ్లడం మానుకున్నారు. క్రమేపీ ఆ గుహ ఎక్కడుందో కూడా మర్చిపోయారు. 15వ శతాబ్దంలో తిరిగి ‘బూటా మాలిక్’ అనే గొర్రెల కాపరి ఈ లింగాన్ని కనుక్కోవడంతో తిరిగి ఈ క్షేత్రానికి ప్రచారం లభించింది.
రెండు మార్గాలు: అమర్నాథ్కు చేరుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి దారిలో పెహల్గావ్ నుంచి పంచతరణికి వెళ్లి... అక్కడి నుంచి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉండే గుహకి చేరుకుంటారు. కాస్త దూరమైనా, శివుడు నడిచివెళ్లిన దారి కావడంతో చాలామంది యాత్రికులు ఈ మార్గాన్నే ఎంచుకొంటారు. ఇక శ్రీనగర్ నుంచి బాల్తాల్కు చేరుకుని అక్కడి నుంచి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహకు చేరుకోవడం మరో మార్గం. అయితే బాల్తాల్ నుంచి గుహకు చేరుకునే మార్గం చాలా కష్టంగా ఉంటుంది.
ఇలా వెళ్లాలి.... అమర్నాథ్ యాత్ర ఏటా ఆషాఢమాసంలో మొదలై సాధారణంగా రాఖీపౌర్ణమి రోజున ముగుస్తుంది. అలాగే ఈసారి కూడా జూన్ 30న మొదలై ఆగస్టు 11న ముగుస్తోంది.
#amarnath2022 #amarnathyatra #ontariyatrikudu
www.youtube.co...
www.facebook.c...
/ srinivas_ontariyatrikudu
www.youtube.co...
www.facebook.c...
/ srinivas_ontariyatrikudu
Негізгі бет మంచుకొండల్లో మహాశివుని కోసం సాగే యాత్ర ఇది. చావుబతుకుల మద్య ఎందుకు ఇంత పోరాటం?
Пікірлер: 77