పోలవరం నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు నాటి ముఖ్యమంత్రి శ్రీయుతులు వైఎస్ రాజశేఖరరెడ్డి సాధించ గలిగారు.. ఈ క్రమంలో 1) తన MP లతో కలసి అనేక మార్లు ఢిల్లీకి వెళ్లి పోలవరం నిర్మాణ ఆవశ్యకత , ప్రాధాన్యతలను వివరించి ఒప్పించ గలిగారు. 2) అలా 15 దశాబ్దాల పోలవరం కల 2004 జూన్ నెలలో వైఎస్ఆర్ మొదటి అడుగులు ముందుకు వేయించారు 3) 2005 సెప్టెంబర్ నెలలో పోలవరం నిర్మాణ స్థలికి అనుమతులు మంజూరు చేయించారు.. 4) 2006 జులై నెలలో వన్య ప్రాణుల రక్షణ అనుమతులు మంజూరు అయ్యేలా చేశారు.. 5) 2007 ఏప్రిల్ నెలలో పునరావాస ప్రణాళికా అనుమతులు సాధించారు. 6) 2008 లో పాపికొండల వన్య ప్రాణుల కేంద్రం మళ్లింపు అనుమతులు మంజూరు చేయించారు. 7)2008 డిసెంబర్ నెలలో అటవీ శాఖ stage-I అనుమతులు సాధించారు. 8) 2009 జనవరి నెలలో CWC సాంకేతిక అనుమతులు మంజూరు చేయించారు.. 9)2009 ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రణాళిక శాఖ అనుమతులు పొందారు. 10) 2009 మార్చి నెలలో కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయించారు. 11)2010 జూలై నెలలో ( నాటి కాంగ్రెస్ ప్రభుత్వం) అటవీ శాఖ stage-II అనుమతులు మంజూరు అయ్యాయి.. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొని కుడి ఎడమ కాలువల నిర్మాణం చేపట్టారు..అందుకు 6000 కోట్ల రూపాయలు వ్యయం చేశారు..కనుకనే పోలవరం రాజశేఖర్ రెడ్డి గారి పుత్రిక అని ఘంటా పథంగా చెప్పుటలో ఎటువంటి సందేహం లేదు. వలదు..
Пікірлер: 1