పూల పల్లకిలో వీరన్న స్వామి
కొండల్లో కోనల్లో తిరిగావు వీరన్న.నరసింహ ధ్యానముతో ఆవులను మేపవయ్య. urukunda viranna (narasimha )swamy
Rachana:BC. రంగ
సంగీతం :వెంకటేశ్వర్లు
వీరన్న స్వామి ఉరుకుందు అనే గ్రామంలో రావి చెట్టు రూపాన వెలిసి ఉన్నాడు . ఇది నరసింహ క్షేత్రం కర్నూల్ జిల్లా ఆదోని పట్టణానికి 28 కి. మీ దూరంలో ఉన్న ఈ క్షేత్రం లో హిరణ్యయ్య అనే నరసింహ స్వామి భక్తుడు నరసింహ స్వామి స్వరూపంగా పూజలు అందుకుంటున్నాడు. కౌతాళం కి చెందిన హిరణ్యయ్య నరసింహ స్వామి భక్తుడు ఆజన్మ బ్రహ్మచారి అయిన ఈయన ఆవులు మేపుతూ ఉండేవాడు నిత్యం నరసింహ స్వామిని ధ్యానం చేస్తూ గడిపిన ఈ యోగి పుంగవుడు కాలక్రమేణా ఉరుకుంద అనే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు ఆ తర్వాత ఇక్కడే సమాధి చెందడం జరిగింది యోగి అయిన హిరణ్యయ్య పేరు వ్యావహారికంగా వీరన్న అయింది కొందరు ఈరణ్ణ అని పిలుస్తారు. అయన సమాధి చెందిన ప్రాంతంలో రావిచెట్టు మొలిచింది సమాధి,రావిచెట్టు విశేషంగా పూజలు అందుకుంటున్నాయి ముఖ్యంగా శ్రావణమాసం,కార్తీక మాసం,అమావాస్య,సోమ,గురు వారాల్లో అధిక సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంటారు. శ్రావణ మాసంలో దేశం నలుమూలల నుండి భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు.
Негізгі бет పూల పల్లకిలో వీరన్న స్వామి | |Pulapallakilo Veeranna Swamy ||కొండల్లో కోనల్లో తిరిగావు వీరన్న.నరసింహ
Пікірлер: 16