#vedamargham
Satrasala Sri Mallikarjuna Swamy temple Old Lord Shiva Temple Guntur Andhra Pradesh
సత్రశాల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం
వేదమార్గం లో ఈ నాటి క్షేత్ర దర్శనం కి స్వాగతం
సత్రశాల
అతి పురాతన శైవ క్షేత్రం
పవిత్ర కృష్ణ నదీ పరీవాహక ప్రాంతంలో
ప్రశాంతమైన ప్రకృతికి పెట్టింది పేరు
గుంటూరుకి నూట ఇరవై కిలోమీటర్ల మరియు మాచర్లకు ఇరవై కిలోమీటర్ల
దూరంలో ఉంది
ఇక్కడి స్వామివారిని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అని అంటారు
ప్రత్యేకతలు
ఈ క్షేత్ర ఈశ్వర దర్శనం ద్వారా శని దేవుని ప్రసన్నం కలుగుతుంది అని,
శివరాత్రి నాడు ఈ శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి లింగ దర్శనం సర్వ కష్టాలను హరిస్తుందని
పురాతన కాలం నుండి భక్తుల నమ్మకం.
స్థల పురాణం మరియు పూజారులు చెప్పిన కధనం ప్రకారం : ఈ క్షేత్రానికి ఈ పేరు రావడానికి గల కారణం
భగవాన్ శ్రీరాముడు తన విల్లు, బాణములు మరియు శస్త్రములు ఇచట ఉంచారు , అందువల్ల మొదట శస్త్రశాల అని పిలిచారు , కాల క్రమేణా అది సత్రశాల గా మారింది.
ఇక ఈ సత్రశాల క్షేత్రంలోని శివలింగాన్ని విశ్వామిత్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. ఆ శివలింగాన్ని మల్లేశ్వర లింగం అని పిలుస్తారు. ఈ సత్రశాలలోని మల్లేశ్వర లింగానికి అనేక మహిమలు ఉన్నాయని చెబుతారు.
ఇక్కడ మహర్షులు అనేక సుదీర్ఘ సత్రయాగాదులు చేస్తూ ఈశ్వారాధన చేసినందువల్ల ఈ స్థలానికి సత్రశాల అని పేరు వచ్చింది
మరో కథనం ప్రకారం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడం కోసం సత్రయాగం చేయడం వల్ల దీనికి సత్రశాల అని పేరు వచ్చినట్లు చెబుతారు.
ఇంకొక ప్రత్యక్ష నిదర్శనం , ప్రతి పౌర్ణమికి నాగేంద్ర స్వామి వారు వచ్చి శివలింగమునకు చుట్టుకుని ఉంటారు .
ఇక ఇక్కడ కాకులు వాలక పోవడానికి గల కారణం గురించి పూజారులు ఒక కథనం చెబుతారు. దీని ప్రకారం విశ్వామిత్ర మహర్షి ఒకసారి ఇక్కడ యాగం చేస్తూ ఉంటాడు. అటు పై బ్రహ్మర్షి అవ్వాలన్న ఉద్దేశంతో ఘెర తపస్సు కూడా మొదలుపెడుతారు. అయితే ఆయన పై దైదా కుమారుడైన కాకాసురుడికి మిక్కిలి కోపం. దీంతో దైదా కుమారుడైన కాకాసురుడు ఇక్కడ తన తోటివారిని వెంటబెట్టుకొని వచ్చి ఆ విశ్వామిత్రుడి యాగాన్ని భగ్నం చేస్తాడు. దీంతో ఈ క్షేత్రంలో కాకులు ఎక్కడ వాలినా వాటి ప్రాణాలు పోతాయని శపిస్తాడు. అప్పటి నుంచి ఇక్కడ కాకులు వాలవు. ఈ క్షేత్రాన్ని సందర్శించుకుంటే ఆ శని దేవుని ప్రసన్నం కలుగుతుంది చెబుతారు.
పురాతన శాసనాల కధనం ప్రకారం , ఈ సత్రశాల లో నాగబంధనం తో కూడిన నిధులు ఉన్నాయని అంటారు.
ఈ సత్రశాల క్షేత్రంలో అనేక ప్రాచీన శివాలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో భ్రమరాంబ, మల్లికార్జునస్వామి, శ్రీ కుమారస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి తదితర ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.
అందువల్లే సత్రశాల లో స్థానికంగా ఉన్న ప్రజలే కాకుండా ఈ క్షేత్ర మహిమ తెలిసిన వారు ఏడాదికి ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని సందర్శించుకొని వెలుతుంటారు. విదేశాల్లో ఉన్నాసరే శివరాత్రి సమయంలో ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు.
ప్రతి ఏడాది ఆషాడ శుద్ధ ఏకాదశి, వ్యాస పూర్ణిమ, మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ సత్రశాలకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు చేరుకొని స్వామివారిని దర్శించుకొంటూ ఉంటారు. చుట్టు పక్కల ఉన్న వారు శివరాత్రి పర్వదినాన ప్రభలు కట్టుకొని ఇక్కడికి వచ్చి జాగారణ చేస్తారు.
ఇక పొరుగున ఉన్న తెలంగాణ నుంచి కూడా క`ష్ణానదిలో లాంచీల ద్వారా ఇక్కడకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. లాంచి ప్రయాణం జీవితంలో మరుపురాని అనుభూతిని మిగులుస్తుంది.
గుంటూరుకు 125 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం మరో పుణ్యక్షేత్రమైన మాచెర్లకు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
అందువల్ల ఈ క్షేత్రానికి వెళితే చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను కూడా సందర్శించుకోవచ్చు. ఇక గుంటూరు, మాచార్ల నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా పాలువాయి జంక్షన్ చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటోద్వారా 6 కిలోమీటర్లు ప్రయాణించి సత్రశాలకు చేరుకోవచ్చు.
ఇక్కడ వసతి సౌకర్యం చాలా బాగుంటుంది. కులాలవారిగా సత్రాలు కూడా ఉంటాయి.
ఇక్కడి ప్రధాన ఆలయాన్ని కాకతీయులకు సాంతుడైన అంబదేవుడు క్రీస్తుశకం 1244లో నిర్మించాడని ఇక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి స్వామివారిని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అని అంటారు. క`ష్ణానది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం పరిసరాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
Негізгі бет Satrasala Sri Mallikarjuna Swamy temple | Old Lord Shiva | సత్రశాల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం
Пікірлер: 3