పాండవశిబిరంలో జరిగిన మారణ కాండను ధర్మరాజుకు ఎరిగించుట:
మరునాడు తెల్లవారగానే ధర్మరాజు తన సోదరులు భీమార్జున నకులసహదేవులు, కృష్ణుడు, సాత్యకి పరివేష్టించి ఉండగా ధృష్టద్యుమ్నుని రథసారథి పరుగెత్తుకుని వచ్చి సాష్టాంగ దండప్రమాణం ఆచరించి చేతులు కట్టుకుని " ధర్మరాజా! నిన్న అర్ధరాత్రి మన శిబిరాలలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ప్రవేశించారు. కృతవర్మ, కృపాచార్యుడు ముఖద్వారమున ఉండగా అశ్వత్థామ మాత్రం ధృష్టద్యుమ్నుడిని అతి దారుణంగా చంపాడు. ఆ తరువాత అతడి సోదరులను, కుమారులను పాంచాలరాకుమారులను, అర్ధరాత్రివేళ అతి క్రూరంగా చంపాడు. తరువాత ప్రభద్రక, మత్స్య, చేది సైన్యములను నిశ్శేషంగా చంపాడు. ఆ తురువాత అతడిని ఎదుర్కొన్న శిఖండి, ఉపపాండవులను ఒక్క తృటిలో వధించాడు. అసురుడి వలె చెలరేగిన అశ్వత్థామ ఎదుట మన సైన్యములు గజములు, హయములు ఆగలేక పోయాయి. అశ్వత్థామ దయాదాక్షిణ్య రహితంగా అందరిని చంపాడు. అతడి చేతిలో తప్పించుకుని వెళ్ళిన వారిని కృపాచార్య, కృతవర్మలు చిత్రవధ చేసారు. ముగ్గురూ అతి క్రూరంగా మన శిబిరాలను పీనుగుల పెంటగా చేసారు. నేను కృతవర్మ చేతికి చిక్కాను. నేను అతడి కాళ్ళు పట్టి వేడగా నన్ను కనికరించి వదిలాడు. ఈ విషయం మీకు విన్నవించడానికి నేను మీ వద్దకు వచ్చాను " అన్నాడు
Негізгі бет సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము.
Пікірлер: 22