#vedamargham #nandavaram #chowdeswari
Sri Chowdeswari Devi Temple - Nandavaram - శ్రీ చౌడేశ్వరి దేవి క్షేత్రము నందవరం - Vedamargham
కాశీ క్షేత్రం నుండి అమ్మవారు
కాశీ బ్రాహ్మణులతో కూడి వచ్చి
నందన చక్రవర్తికి సాక్ష్యమిచ్చుటకు
వచ్చిన బిల (గుహ) మార్గము
ఆలయ అర్చకులు - శ్రీ రాజేష్ - Cell : 9703885842
ఆలయ చరిత్ర :
పూర్వము సోమేంద్రుడు అను చంద్రవంశపు రాజు ఉండేవాడు. ఆయనకు ఉత్తుంగ బుజుడు అను కుమారుడు కలడు. ఉత్తుంగ బుజుడు మూడు వందల ఒక్క దేవాలయములు నిర్మించెను. ఇతనికి చారుమతి , చతుర్మతి అను భార్యలు కలరు . ఉత్తుంగ బుజుడు చతుర్మతి లకు నందన అను కుమారుడు కలడు . రాజు ఉత్తుంగ బుజుడు న కు కలలో , అతని కుమారుడు నందనుడు భావి సామ్రాట్టు కాగలడని భవిష్య వాణి తెలిపెను .
నందునకు పదహారు సంవత్సరముల వయసు ఉండగా , ఒకనాడు మల్లికార్జున స్వామి భక్తుడు శబర స్వామి ఉత్తుంగ బుజుడు ని దర్శించి , తమ ప్రాంతంలో పులులు తమ పశు సంపదను నాశనం చేయుచున్నాయని , వాటి నుండి రక్షించమని కోరెను. అంతట రాజు కుటుంబ సమేతంగా పులుల నుండి రక్షించుటకు శ్రీ శైలం చేరెను .
అక్కడ ఒకనాడు నందనుడు వేటాడుతూ పవిత్రమైన పాతాళ గంగ ను చేరెను . అచట ఒక మునీశ్వరుడు నందనునకు శ్రీ దత్తాత్రేయ మంత్రమును ఉపదేశించి ,నందుని పేరుతో గొప్ప రాజ్యము స్థాపించెదవని చెప్పి అంతర్ధానమయ్యను. కొంత కాలమునకు పాంచాల దేశ రాకుమారి శశిరేఖను నందనుడు వివాహము చేసుకొనెను. తరువాత ఉత్తుంగ బుజుడు నందనునకు పట్టాభి షేకము చేసి వాన ప్రస్థమును స్వీకరించెను .
నందనుడు ఒక దత్తాత్రేయ దేవాలమును నిర్మించి భక్తితో ఉపాసన చేయుచుండెను. ఒకనాడు నందనునకు దత్తాత్రేయుల వారు దర్శనము ఇచ్చి వరము కోరుకొమ్మనగా , నందనుడు నిత్యం కాశీ క్షేత్ర గంగా స్నానం వరంగా అడిగెను , అప్పుడు స్వామి వారు పాదుకలను ప్రసాదించిరి. పాదుకలు సాయంతో , నిత్యం బ్రాహ్మి ముహూర్తం లో నందనుడు కాశీ గంగ లో స్నానం చేసి విశాలాక్షి ని పూజించి రాజ్యమునకు తిరిగి వచ్చేవాడు. ఒకనాడు మహారాణికి అనుమానం రాగా, రాజు పాదుకల సాయంతో రాణి ని కూడా కాశీ కి తీసుకు వెళ్లెను. అక్కడ రాణి కారణంగా పాదుకలు మహిమ నశించెను . అంతట రాజు రాణి కాశీ బ్రాహ్మణులను ప్రార్ధించగా , వారు వారి యొక్క సూర్యునికి ఒసగిన అర్ఘ్య ఫలమును ధారపోసి మరల రాజు , రాణి ని రాజ్యమునకు చేర్చిరి .
కాశీ బ్రాహ్మణులు చేసిన సాయమునకు ప్రతిఫలంగా, వారు ఎప్పుడు వచ్చి అడిగినా సాయం చేగలనని నందనుడు వాగ్దానము చేసెను .
కొంతకాలము గడిచిన తరువాత , కాశీ యందు కరువు ఏర్పడెను . అంతట కాశీ బ్రాహ్మణులు నందనుడు చేసిన వాగ్దానము ను గుర్తు చేసుకొని రాజును సహాయం కోరిరి. రాజు ఒక ప్రత్యేక కారణము చే , తాను చేసిన వాగ్దానము నకు సాక్ష్యము ఏమిటి అని అడిగెను. బ్రాహ్మణులు కాశీ విశాలాక్షి యే సాక్ష్యము చెప్పనని , తీసుకు వస్తామని చెప్పి , కాశీ విశాలాక్షి ని ప్రార్దించిరి.
అంతట , బ్రాహ్మణుల ప్రార్ధనను మన్నించి అమ్మవారు భూమార్గం లో వారి వెంట పయన మయ్యను. నందవరం గ్రామ దగ్గర బ్రాహ్మణులు వెనుకకు అనుమానం తో తిరిగి చూడగా అమ్మవారు శిలా రూపము పొంది , రాజును ఇక్కడ కు రమ్మని చెప్పెను .
విషయం తెలిసిన రాజు , వెనువెంటనే అమ్మను దర్శించి క్షమించ మని ప్రార్ధించి , తాను అమ్మవారిని ఇక్కడకు రప్పించుటకే ఆవిధంగా సాక్ష్యం అడిగానని చెప్పెను. బ్రాహ్మణులకు వారు కోరుకున్న విధంగా అన్నియు ఇచ్చి పంపెను. అమ్మవారికి దేవాలయమును నిర్మించెను .
Негізгі бет Sri Chowdeswari Devi Temple - Nandavaram - శ్రీ చౌడేశ్వరి దేవి క్షేత్రము నందవరం - Vedamargham
Пікірлер