వ్యవసాయ మోటార్లు దొంగతనం చేస్తున్న దొంగల అరెస్ట్.
కేసుల్లో నలుగురు దొంగలను, మోటర్లు కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన గరిడేపల్లి పోలీసులు. ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
26 కేసుల్లో 4.34 లక్షల విలువగల 31 మోటర్లు, 135 మోటార్ల నుండి దొంగిలించిన మోటార్ కోర్ కాఫర్ వైర్ అమ్మగా వచ్చిన 10.01 లక్షల నగదు సీజ్ చేసి ఆటో, 3 బైక్ లు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్న పోలిసులు.
TR9 న్యూస్ సూర్యాపేట : గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్నగర్, పాలకవీడు, చిలుకూరు, మేళ్లచెరువు పోలీసు స్టేషన్ ల పరిధిలో మోటార్లు దొంగతనం సంభందించి సూర్యాపేట పోలిసులు 26 కేసులు నమోదు చేశారు.
కోదాడ సబ్ డివిజన్ పరిధిలో రైతులు బావులపై వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు, మోటార్ లోని కాఫర్ వైర్ దొంగతానులు చేస్తున్న వారిపై పోలీసు సిబ్బంది అప్రమత్తమై నిఘా ఉంచడం జరిగినది. కేసుల దర్యాప్తు లో భాగంగా గరిడేపల్లి పోలీసులు మండల పరిధిలో కల్మలచెరువు రోడ్డు లో వాహనాలు తనికి చేస్తుండగా ద్విచక్రవానంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ NTR జిల్లాకు చెందిన ఉప్పతల వాసు, మఠంపల్లి మండలానికి చెందిన వేముల కోటేశ్వర్ రావు, పోలీసు వారిని గమనించి తప్పించుకోవాలని ప్రయత్నించగా అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విదారించగా ఇరువురి వద్ద 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మోటార్లు, మోటార్ కోర్ వైర్ దొంగతనం చేసి అమ్ముతున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.
Негізгі бет వ్యవసాయ బావుల వద్ద మోటార్లు దొంగిలించిన దొంగలు అరెస్ట్
Пікірлер