భీష్ముడు చెప్పిన కథలు
కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోయాక ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ భీష్ముడు అంపశయ్య మీదే ఉంటాడు. ఆ సమయంలో ధర్మరాజు కొన్నిరోజుల పాటూ రోజూ వెళ్లి ఆయనను దర్శించుకుని వచ్చేవాడు. ఆ సమయంలో భీష్ముడు ధర్మరాజుకు వర్ణాశ్రమధర్మాల గురించి, రాజనీతి గురించి అనేక విషయాలు చెప్పేవాడు. కొన్ని ధర్మసూక్ష్మాలు సులభంగా అర్థం కావడం కోసం ఎన్నో కథలు కూడా చెప్పాడు. అటువంటి కథలలో ఒక కథను ఈరోజు మనం చెప్పుకుందాం.
ఒకరోజు ధర్మరాజు భీష్ముడిని “పితామహా! మిత్రులతోను శత్రువులతోను రాజన్నవాడు ఎలా ప్రవర్తించాలి?” అని అడిగాడు. అప్పుడు భీష్ముడు “నాయనా ధర్మనందనా.. ఎక్కడా శాశ్వతమైన శత్రువులు కానీ, శాశ్వతమైన మిత్రులు కానీ ఉండరు. మనం ఉన్న చోటును బట్టి, అప్పటి కాలాన్ని బట్టి ప్రవర్తిస్తూ మనల్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను” అంటూ ఇలా చెప్పసాగాడు.
Негізгі бет భారతంలో కథలు | భీష్ముడు చెప్పిన పిల్లి ఎలుక కథ | The Teachings of Bhishma | Rajan PTSK
Пікірлер: 80