ద్వారకానగరం మరో ఏడు రోజుల్లో సముద్రంలో మునిగిపోతుందనగా, శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడైన ఉద్ధవునికి ముక్తి మార్గాన్ని ఉపదేశిస్తాడు. అందులో భాగంగా ఒకానొకప్పుడు యదుమహారాజుకు, ఒక అవధూతకు మధ్య జరిగిన యోగపరమైన సంవాదాన్ని చెబుతాడు. ఆ అవధూతే జగద్గురువైన దత్తాత్రేయ భగవానుడు. ఈ కథ మనకు వ్యాస భాగవతం ఏకాదశ స్కందంలో ఏడు, ఎనిమిది, తొమ్మిది అధ్యాయాలలో కనబడుతుంది. ఒకసారి యదుమహారాజు అవధూత స్వరూపుడైన దత్తాత్రేయ భగవానిడి ముందు మోకరిల్లి “మహాత్మా! నువ్వు ఇటువంటి అద్వైత స్థితిని ఎలా పొందగలిగావంటూ” వినయంగా అడుగుతాడు. అప్పుడు దత్తాత్రేయుడు యదువుకు తత్త్వాన్ని ఉపదేశిస్తూ.. “యదుమహారాజా! ఏ వ్యక్తయినా ఎవరో ఒక గురువుని ఆశ్రయించి, అతనివద్ద కేవలం శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. నేను ఈలోకంలో ఉన్న ఇరవై నలుగురు గురువులు ద్వారా జ్ఞానాన్ని సముపార్జించాను. ఆ గురువులెవరో చెబుతాను విను” అంటూ ఇలా చెప్పసాగాడు.
- Rajan PTSK
Негізгі бет Ойын-сауық జగద్గురు దత్తాత్రేయుడి 24 మంది గురువుల కథ | Lord Dattatreya and His 24 Gurus | Rajan PTSK
Пікірлер: 20