'అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి'
నూతన ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి
"ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపుకై జూలై 10న రాష్ట్ర వ్యాపితంగా ధర్నాలు"
అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ
కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు నూతనంగా ఏర్పడిన దరిమిలా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు.
తిరుపతి నగరంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారంకై 42 రోజులపాటు వీరోచిత పోరాటాన్ని నిర్వహించామని, ఆ సందర్భంగా ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నామని గుర్తు చేశారు.
ఆ పోరాటానికి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలు తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తల వరకు తమ శిబిరాల వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారని, తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కావస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తాము కోరుతున్నట్టు ఆమె తెలిపారు.
ఇప్పటికే అంగన్వాడీల సమస్యల పరిష్కారం కు సంబంధిత మంత్రికి వినతి పత్రం సమర్పించినట్టు ఆమె తెలిపారు.
ఎఫ్ ఆర్ ఎస్ యాప్ పేరుతో అంగన్వాడీలను వేధింపులు గురి చేయటం సరైంది కాదని ఇప్పటికే యాప్ ల భారంతో అల్లాడిపోతున్న అంగన్వాడీలకు యాప్ ల భారం నుంచి మినహాయించాలని పలుమార్లు కోరామని తెలిపారు.
ఇప్పుడు నూతనంగా ఎఫ్ ఆర్ ఎస్ పేరుతో పేస్ రికగ్నిషన్ యాప్ ను ప్రవేశ పెట్టడం సమంజసం కాదని తక్షణం దీనిని ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత ఏడాది ఐసిడిఎస్ కు రూ. 300 కోట్ల రూపాయలను నిధుల నుంచి కేంద్రం కోత కోసిందని ఈ ధోరణి ఇలానే కొనసాగితే ఐసిడిఎస్ బలహీనపడుతుందని గుర్తు చేశారు.
ఐసిడిఎస్ బలోపేతానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రూ. 50 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
23వ తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లుగా ప్రకటించాలని తగినంత నిధులు కేటాయించాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో కక్ష్య సాధింపు వ్యవహారాలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మరుసటి రోజు నుంచే పలుచోట్ల స్కీం వర్కర్లను ముఖ్యంగా అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లను స్థానిక టిడిపి నేతలు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పార్టీల పేర్లు పెట్టి తొలగింపులకు పూనుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం కూడా 2019 నుంచి ఇలాంటి చర్యలకు ఒడిగట్టే ప్రజలలో అభాసు పాలైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వమైనా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.
కుట్రపూరిత విధానాలు అనుసరించడం వల్ల ప్రజల్లో పలుచన అవుతారని హెచ్చరించారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం చొరవ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వేతనాలు పెంచాలని రాష్ట్రంలోని లక్ష మంది అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందం మేరకు జూలై నెల నుంచి వేతనాలు పెంచాల్సి ఉండగా, వైసీపీ ప్రభుత్వం లోని అధికారులు తమతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా జీవోలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
అంగన్వాడీ లాంటి చిరుద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, తగినంత వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్, వాణిశ్రీ, అధ్యక్షురాలు పద్మలీలలు మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ జిల్లాలోని 34 మండలాల్లో అంగన్వాడీలు జూలై 10వ తేదీన ధర్నా కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామిక దూరంలో విడనాడాలని ప్రజా సంక్షేమ పాలన తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు జులై 10న జరిగే ధర్నాలలో జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల నుంచి సిబ్బంది పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నమస్కారములతో ఎస్ వాణిశ్రీ ప్రధాన కార్యదర్శి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి జిల్లా కమిటీ తిరుపతి.
Негізгі бет నూతన
Пікірлер: 23